NZB: బోధన్ పట్టణం లయన్స్ కంటి ఆసుపత్రి వెనకాల రైల్వే స్టేషన్ పక్కన పేకాట ఆడుతున్న ఐదుగురుని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. వారి నుంచి రూ.1,970 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.