KMR: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతిని పారదర్శకంగా అమలు చేయాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో భూ భారతి చట్టం, భూసమస్యల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పైలట్ ప్రాజెక్ట్కు లింగంపేట్ మండలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. జూన్ 3 నుంచి 20వ తేదీవరకు అన్ని మండలాల్లో రెవెన్యూసదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.