KMR: బాన్సువాడ డివిజన్లో మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 100 మందికి కాసుల రోహిత్ అధ్యక్షతన పురస్కారాలు ప్రదానం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రాయితీలతో పాటు అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.