KDP: రాయలసీమ సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి వెంటనే సిద్దేశ్వరం అలుగును నిర్మించాలని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజా శంకుస్థాపన చేసి నేటికీ 9 ఏళ్ళు పూర్తి అయిందన్నారు. ఈ డిమాండ్తో శనివారం ప్రొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ రెడ్డికి ఆయన వినతిపత్రం సమర్పించారు.