W.G: సమాజసేవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు సందర్భంగా భీమవరం అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ మండలంలో 25 మంది దివ్యాంగులకు నూతన వస్త్రాలు, దుప్పట్లను శ్రీవిజ్ఞానవేదిక ద్వారా ఎమ్మెల్యే అందించారు.