ASF: రైతు భీమా ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఇంఛార్జ్ ADA మిలింద్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో 105 మంది మరణించిన రైతు కుటుంబాలకు 4 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు రైతు బీమా సహాయం అందించలేదన్నారు.