W.G: తణుకు పట్టణంలో కిరాణా వర్తక సంఘం నూతన భవనాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘంలో దాతల ప్రోత్సాహంతో జరిగిన అభివృద్ధి ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.