CTR : చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. యాదమరి మండలం కొయ్యూరు వద్ద ఉన్న కొత్త చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు శుక్రవారం చనిపోయారు. మృతులు తుమ్మెదపాలేనికి చెందిన సిద్ధు (11), సోమిరెడ్డిపల్లికి చెందిన అభిలేశ్(13)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.