కోనసీమ: నదీపరివాహక ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలనీ బీజేపీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ గురువారం పేర్కొన్నారు. జిల్లాస్దాయి నుండి గ్రామాలలో కుటుంబస్దాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో పటిష్ఠమైన చర్యలు చేపట్టి, లోతైన ప్రాంతాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు.