కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన గూల విట్టల్ కుమారుడు గుల గోవర్ధన్(28) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంజనీరింగ్ చేసిన యువకుడు చెన్నైలో ఉద్యోగం చేసి అనంతరం అమెరికా వెళ్లి ఉన్నత చదువులకై వెళ్లి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.