JGL: తండ్రి, కొడుకు ఒకరి పై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రాచకొండ దేవయ్య, కుమారుడు నవీన్ తాను చేసిన అప్పులు తీర్చాలని, ఆస్తి పంపకాలు చేయాలని గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా కత్తి తీసుకొని తండ్రిపై దాడి చేయగా చేతికి గాయమైంది. దీంతో తండ్రి ఎదురుదాడి చేయగా కుమారుడు నవీన్కు తీవ్రగాయాలయ్యాయి.