PLD: రావిపాడు, వినుకొండ, గుంటూరు రోడ్లలో గురువారం సాయంత్రం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలపై కేసులు నమోదు చేశారు. 33 ఆటోలపై కేసులు నమోదు చేసి, 7 వాహనాలను సీజ్ చేశారు. రూ. 2,20,000 జరిమానా వసూలు చేశారు. ఈ తనిఖీల్లో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఎంవిఐ శివ నాగేశ్వరరావు, ఎస్సై కిషోర్ పాల్గొన్నారు.