TPT: అలిపిరి కాలినడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి 7వ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం తనిఖీ చేశారు. నడకదారిలో ఏర్పాటు చేసిన స్టాటిక్, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరుపై ఆయన ఆరా తీశారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాడులను ఎదుర్కోవడానికి తాత్కాలికంగా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.