KKD: కాకినాడ సర్లోపేట విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో వార్షిక మరమ్మతుల నిమిత్తం శుక్రవారం సరఫరా నిలిపివేయ నున్నట్లు ఈఈ ఎన్. ఉదయభాస్కర్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరోపేట, టిడ్కో గృహ సముదాయం, పోర్టు ఏరియా, బీచ్ రోడ్డు, రాజాజీవీధి, సినిమారోడ్డు, గోల్డ్ మార్కెట్, యానాం రోడ్డులో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.