అన్నమయ్య: మదనపల్లెలో టీడీపీ యువ నాయకుడిపై అల్లరి మూకలు దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం సాయంత్రం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక సైదాపేటకు చెందిన జబిఉల్లా ఖాన్ సీటీఎం రోడ్డులో వస్తుండగా.. గొడవ జరగడం చూసి సర్ది చెప్పేందుకు వెళ్లాడు. మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటూ అల్లరి మూకలలో మల్లి అతని కొడుకు పండు తదితరులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలిపాడు.