KRNL: నందికొట్కూరుకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు డా. దేసెట్టి, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తన రక్తంతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశారు. ఎన్టీఆర్ జానపద చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించి, తెలుగు ప్రజలకు విలక్షణ సేవలు అందించారని బుధవారం పేర్కొన్నారు.