కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,86,678 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 34 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని.. 3100 మంది అన్నప్రసాదం స్వీకరించారని అన్నారు.