TPT: తిరుపతి స్విమ్స్ నిర్మాణంలో ఉన్న భవనాలను టీటీటీ ఈవో శ్యామలరావు బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్విమ్స్ సిబ్బందిని ఆదేశించారు.