KRNL: కడపలో నిర్వహిస్తున్న మహానాడులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తెచ్చామన్నారు. ఏడాది పాలనలో గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దారని, అలాగే యాంటీ నార్కొటిక్ డ్రగ్స్ కోసం ఈగల్ను ఏర్పాటు చేశామన్నారు.