ATP: కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో బుధవారం ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రైతులు భయంతో పరుగులు తీశారు. యువ రైతు పవన్పై దాడి ప్రయత్నం జరగగా.. అతడు తప్పించుకున్నాడు. ఎలుగుబంట్ల సంచారం పెరగడంతో అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకుని వాటిని అటవీ ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.