RR: నార్సింగి పరిధిలోని మేకన్ గడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా.. వైద్యురాలు భూమిక తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా భూమికకు బ్రెయిన్ డెడ్ అయింది. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.