CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.