SRPT: మునగాల మండలం సీతానగరం గ్రామంలో పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా సోమవారం డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ వీరయ్య స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం, సాధారణ రోజుల్లో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించకుండా, దుర్వాసన రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.