GNTR: ఏటుకూరు బైపాస్ జంక్షన్ వద్ద విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మినీ లారీతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై 6A కింద కేసు నమోదు చేయాలని అధికారుల ఆదేశాలతో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో లారీ యజమాని, డ్రైవర్ మరియు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.