KDP: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని CI నరసింహారాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలలో కిరాణా షాపులలో ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కిరాణా షాపుల యజమానులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.