నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద సోమవారం తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.