TPT: తిరుపతి తిరుణాచూరులోని ప్రసిద్ది గాంచిన పద్మావతి అమ్మవారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పద్మావతి అమ్మవారిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పెనుకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.