TG: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేకపూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెద్దపల్లకి సేవలు, ఆకులపూజలుచేసి భక్తిప్రపత్తిని చాటుకుంటున్నారు.