SKLM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు అని శ్రీకాకులం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.