KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం, కాచాపూర్ గ్రామంలోని విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించినందున, కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.