MNCL: జన్నారం మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా గాజుల లింగన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జన్నారంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లింగన్న గౌడ్, జాడి వెంకట్లను ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న చిలువేరు నరసయ్యను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.