GDL: గద్వాల పురపాలక పరిధిలోని 24వ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రహారీ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. ప్రహారీ నిర్మాణానికి రూ. 5 లక్షల నిధులు మంజూరైనట్లు వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.