నిర్మల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఉట్నూర్ పట్టణంతో పాటు దంతన్పల్లి చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని కులాలు, మతాల వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.