MDK: మెదక్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను పూర్తిగా తగ్గించింది. కేవలం డీలక్స్ బస్సులను స్పెషల్ బస్సులు అంటూ నడిపిస్తుంది. అంతే కాకుండా నార్మల్ చార్జీల కంటే టికెట్లు ధరలను రెండు రెట్లు పెంచి నడుపుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.