KMM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు బుధవారం ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సహచర పార్టీ నాయకులతో కలిసి వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సీనియర్ నాయకులు గెంటల విద్యాసాగర్ను సన్మానించారు. వాజ్ పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.