ఖమ్మం: మణుగూరు మండల కేంద్రం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటు ఆటో డ్రైవర్ కిందకు దూకేయడంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు.