WNP: ప్రజా శ్రేయస్సు కోసం, దేశం కోసం పనిచేసిన వ్యక్తి మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి అని బీజేపీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. దివంగత అటల్ బిహారీ వాజ్ పేయ్ 100వ జయంతిని బుధవారం వనపర్తి పట్టణంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.