MHBD: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో దహన సంస్కారాలు చేయటానికి స్మశానవాటికలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన గదులు కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. అల్లరి మూకలు మద్యం, సిగరెట్లు, గంజాయి తాగడానికి స్థావరాలుగా చేసుకున్నారు. దీంతో స్మశానవాటిక గదులు అపరిశుభ్రంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.