NZB: భారతదేశం భిన్న మతాలు, కులాల సమూహమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చీలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను గౌరవించడం మానవత్వమన్నారు.