JGL: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద బుధవారం భారత్ సురక్ష సమితి నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, అక్కినపెళ్ళి కాశీనాథo, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.