NLG: దేవరకొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మనుస్మృతి గ్రంథ ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు మాట్లాడుతూ.. 1927 డిసెంబర్ 25న బీఆర్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టారని అదే స్ఫూర్తిగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేయడం జరిగిందన్నారు.