HYD: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా MMTS రైళ్లు నడపనున్నట్లు SCR సీపీఆర్డీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు.