KMM: భద్రాచలం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ పనులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల ప్రయాణ సమయం తగ్గనుంది.