RR: మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద పరిసరాలు దారుణంగా మారాయి. కల్వరి టెంపుల్ వద్ద చెత్తను క్లియర్ చేసే సిబ్బంది అక్కడే తగలబెట్టడంతో పరిసరాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. వాహనాలు పార్కింగ్ చేసే వారికి, అటువైపుగా వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇంత అస్వచ్ఛంగా ఉన్నా సరే అధికారులు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.