»Telangana Government Good News For Medical Students
Minister Harish Rao : మెడికల్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై ఎంసిహెచ్ఆర్డీలో (MCHRD) సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై ఎంసిహెచ్ఆర్డీలో (MCHRD) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) మాట్లాడుతూ.. ‘9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చాము. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల (Assistant Professors) నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది, రెండు మూడు రోజుల్లో ప్రోవిసనల్ మెరిట్ లిస్టు (Provisional Merit List) విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటాము’ అని ఆయన వెల్లడించారు. కౌన్సిలింగ్ నిర్వహించి 9 మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలని మంత్రి ఆదేశించారు. 9 మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్తో పాటు పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. 9 కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలనీ అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్ (Cm kcr) మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్,(Karimnagar) ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలని మంత్రి తెలిపారు. ఎన్ఎంసి (NMC) నిబంధనలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందం పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ను మంత్రి కోరారు.