HYD: గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి పోలీసులు భద్రత పెంచారు. ఇరాన్ -ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడ భద్రత ఇచ్చారు. దీంతో 70 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటువైపుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అమెరికన్లు ఉండే హోటల్పైన ప్రత్యేక దృష్టి పెట్టారు.