ATP: మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్వ వైభవంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.