జీడిపిక్కలకు ప్రభుత్వం రూ. 200 మద్దతు ధర ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ రాయవరం మండలం వేమగిరిలో ఉపాధి కూలీలతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వమే జీడిపిక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్న ప్రభుత్వం జీడిపిక్కలకు ఎందుకు ప్రకటించడం లేదన్నారు.