ASR: గుర్తేడు మండలం వేజువాడ గ్రామానికి చెందిన పాపాయమ్మ అంబులెన్సులో ప్రసవించింది. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం అయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు పురుడుపోయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వైద్య పరీక్షలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామని సిబ్బంది తెలిపారు.