HYD: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేస్-1, 2 ప్రాంతాల్లో రోడ్డు పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 42 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.